AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి..: మంత్రి ఎర్రబెల్లి

పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం వ్యవసాయానుబంధ..

సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అభివృద్ధి..: మంత్రి ఎర్రబెల్లి
Sanjay Kasula
|

Updated on: Sep 03, 2020 | 9:18 PM

Share

పేద మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యమని పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అత్యంత శ్రద్ధతో ప్రభుత్వం వ్యవసాయానుబంధ పరిశ్రమలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌యూనిట్‌లపై దృష్టి సారించిందని అన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్‌, టీఎస్‌ఐపార్ట్‌లో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో కాళేశ్వరం, దేవాదుల, ఎస్సారెస్పీ వంటి అనేకానేక ప్రాజెక్టులతో జల విప్లవం వచ్చిందన్నారు. 24గంటలూ విద్యుత్‌, రుణమాఫీ, రైతులకు పెట్టుబడులు, అందుబాటులో ఎరువులతో రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా సాగులోకి వచ్చిందని మంత్రి గుర్తు చేశారు. జల విప్లవం, నీలి విప్లవానికి, గులాబీ, విప్లవానికి, శ్వేత విప్లవానికి దారితీసిందన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.

నిరుపేద మహిళలను సంఘటిత పరిచి రాష్ట్రంలో వేలాది మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా పొదుపులో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిన మన రాష్ట్రంలో సెర్చ్‌ కృషిని వెలకట్టలేమని అన్నారు. సెర్చ్‌ ఆధ్వర్యంలోనే  19 జిల్లాల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నరైతు మహిళా ఉత్పత్తి సంఘాలతో రాష్ట్రసమాఖ్యను ఏర్పాటు చేస్తామన్నారు.