భారత్-నేపాల్ మధ్య ‘కంట్లో నలుసు’గా మారిన ‘కాలాపాని’..

|

Nov 19, 2019 | 11:42 AM

నిన్న మొన్నటివరకు ఇండియాకు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ ఇపుడు శత్రు దేశంగా మారిపోయింది. నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ‘ జంక్షన్ ‘ లో ఉన్న ‘ కాలాపాని ‘ ప్రాంతం తమదని, ఇక్కడి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఆ దేశ ప్రధాని కె. పి. ఓలి డిమాండ్ చేశారు. ఇటీవల ఇండియా రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్ లో ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేశంలో ఉన్నట్టే […]

భారత్-నేపాల్ మధ్య కంట్లో నలుసుగా మారిన కాలాపాని..
Follow us on

నిన్న మొన్నటివరకు ఇండియాకు మిత్ర దేశంగా ఉన్న నేపాల్ ఇపుడు శత్రు దేశంగా మారిపోయింది. నేపాల్, ఇండియా, టిబెట్ సమీపంలో మూడు ప్రాంతాల ‘ జంక్షన్ ‘ లో ఉన్న ‘ కాలాపాని ‘ ప్రాంతం తమదని, ఇక్కడి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించాలని ఆ దేశ ప్రధాని కె. పి. ఓలి డిమాండ్ చేశారు. ఇటీవల ఇండియా రిలీజ్ చేసిన అధికారిక మ్యాప్ లో ఈ ప్రాంతాన్ని కూడా ఈ దేశంలో ఉన్నట్టే చూపారు. (కాలాపాని నేపాల్ పశ్చిమ భాగంలో ఉంది). ఈ వివాదంపై ఓలి బహిరంగ విమర్శ చేయడం ఇదే మొదటిసారి. దీనిపై భారత ప్రభుత్వం ఇంకా స్పందించనప్పటికీ.. ఈ మ్యాప్ ప్రకారం.. ఈ ప్రాంతం ఖఛ్చితంగా ‘ భారత సార్వభౌమాధికార సరిహద్దే ‘ నని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ తో కొత్తగా సరిహద్దు వివాదం లేదని తెలిపాయి. అయితే నేపాల్ పాలక కమ్యూనిస్ట్ పార్టీ యువజన విభాగం నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఓలి.. తమ దేశ సరిహద్దుల్లోని ఒక్క అంగుళాన్నయినా ఏ దేశమూ ఆక్రమించుకోజాలదని అన్నారు. ఇండియా తక్షణమే కాలాపాని ప్రాంతాన్ని ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. సవరించిన మ్యాప్ తో నేపాల్ కొత్త దాన్ని రూపొందించాలన్న సూచనను ఆయన కొట్టిపారేశారు. ‘ మా భూమి నుంచి భారత్ తన సైన్యాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.. ఆ తరువాతే ఆ దేశంతో చర్చలు జరుపుతాం ‘ అని పేర్కొన్నారు.
భారతీయ మ్యాప్ లపై నేపాల్ లో పాలక, ప్రతిపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. మూడు రోజుల క్రితమే ప్రధాని ఓలి నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోపాల్గొన్న మాజీ ప్రధానులు, మాజీ విదేశాంగ మంత్రులతోసహా అనేకమంది ఈ అంశంపై వెంటనే ఇండియాతో చర్చించాలని డిమాండ్ చేశారు.