అమెరికన్ షిప్ లో పేలుడు…21 మందికి గాయాలు

| Edited By: Pardhasaradhi Peri

Jul 13, 2020 | 9:45 AM

కాలిఫోర్నియా లోని ఓ బేస్ లో నిలిచివున్న  నేవీ నౌకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఉవ్వెత్తున లేచిన మంటల్లో 21 మంది గాయపడ్డారు. మొత్తం 17మంది నేవీ సిబ్బంది, నలుగురు పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు..

అమెరికన్ షిప్ లో పేలుడు...21 మందికి గాయాలు
Follow us on

కాలిఫోర్నియా లోని ఓ బేస్ లో నిలిచివున్న  నేవీ నౌకలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు కారణంగా ఉవ్వెత్తున లేచిన మంటల్లో 21 మంది గాయపడ్డారు. మొత్తం 17మంది నేవీ సిబ్బంది, నలుగురు పౌరులను ఆసుపత్రికి తరలించినట్టు అధికారులు తెలిపారు. మెయింటెనెన్స్ కోసం శాన్ డీగో పోర్టులో నిలిచి ఉన్న నౌకలో జరిగిన ఈ పేలుడుతో దట్టమైన పొగలు ఆవరించాయి. మంటలను అదుపు చేయడానికి ఫైర్ బోట్స్ నీటి క్యానన్లను వినియోగించినప్పటికీ.. పెద్దగా ఫలితం లేకపోయింది. మంటలు కొన్ని రోజులపాటు మండవచ్ఛునని  శాన్ డీగో ఫైర్ డిపార్ట్ మెంట్ హెడ్ కొలిన్ స్టోవెల్ తెలిపారు. పేలుడుకు కారణం తెలియలేదు. ఈ ఘటన జరిగినప్పుడు నౌకలో సుమారు 160 మంది నేవీ సిబ్బంది ఉన్నారని అధికారులు చెప్పారు.