కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..

|

Aug 01, 2020 | 5:25 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి.

కోనసీమలో కరోనా టెర్రర్.. ఆ ప్రాంతంలో కఠిన లాక్‌డౌన్..
Follow us on

Lockdown In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. టెస్టులు పెంచే కొద్దీ పాజిటివ్ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. గత మూడు రోజులుగా 10 వేలకుపైగా కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు అధికారులు ఇప్పటికే పలు జిల్లాల్లో స్వచ్ఛందంగా లాక్ డౌన్ విధించారు.

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా విలయం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రావులపాలెం ప్రాంతంలో రేపటి నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయిలో కఠిన లాక్ డౌన్ విధించనున్నట్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని.. దీనికి అందరూ మద్దతు తెలపాలని కోరారు. కాగా, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచించారు. ఇక తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నిన్నటి వరకు విధించిన లాక్ డౌన్‌ను మరో వారం పాటు పొడిగించినట్లు జిల్లా యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ లాక్ డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల దుకాణాలు, మెడికల్ షాపులకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు.