కామాక్షి అమ్మావారికి లక్ష కుంకుమార్చన

శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి

కామాక్షి అమ్మావారికి లక్ష కుంకుమార్చన

Updated on: Aug 14, 2020 | 3:45 PM

Laksha Kumkumarchana at Kapileshwaram : శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్బంగా కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని కపిలేశ్వరస్వామివారి ఆలయంలో కామాక్షి అమ్మవారికి శాస్త్రోక్తంగా లక్ష కుంకుమార్చన నిర్వహించారు. కరోనా ఆంక్షలకు అనుగూనంగా ఆల‌యంలో ఏకాంతంగా ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

ఇందులో భాగంగా ఆలయంలోని మండపంలో మహాలక్ష్మీ, సరస్వతి, కామాక్షి అమ్మవార్లను కొలువుదీర్చి కుంకుమార్చన చేప‌ట్టారు. ముందుగా క‌ల‌శ‌స్థాప‌న‌, గ‌ణ‌ప‌తి పూజ‌, పుణ్యాహ‌వ‌చనం, క‌ల‌శారాధ‌న చేశారు అర్చకులు. ఈ సందర్భంగా లక్ష సార్లు కుంకుమతో అమ్మవారికి అర్చన చేశారు. ప్రతీ ఏటా ఈ వేడుకను దేవస్థానం పెద్ద ఎత్తున నిర్వహించేంది. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తితో అన్ని రకాల అర్జిత సేవలను ఏకాంతంగానే నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆల‌య డిప్యూటీ ఈవో సుబ్రమణ్యం, సూపరింటెండెంట్‌ భూపతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

తిరుమల తిరుపతిలోనూ కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీవారికి కళ్యాణోత్సవం ఏకాంతంగానే నిర్వహిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇలా భక్తులకు ఆన్ లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

 

Loading...
Unable to load recommendations.
Follow Us