శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత

|

Nov 11, 2020 | 4:35 PM

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది.

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారం పట్టివేత
Follow us on

హైదరాబాద్‌ శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి దాదాపు 1.2 కిలోల బంగారు కడ్డీలను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ దాదాపు రూ. 66.82 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పక్కా సమాచారంతోనే… సౌదీ అరేబియా నుండి వచ్చిన ప్యాసింజర్లను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. అక్రమంగా తరలిస్తున్న బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెప్పారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.