దారుణం.. ఓ ఛానెల్‌ వాహనంపై ఉగ్రదాడి.. జర్నలిస్ట్‌తో పాటుగా..

| Edited By:

May 31, 2020 | 12:38 PM

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. ఉగ్రవాదులు మాత్రం.. ఎక్కడో ఓ చోట అలజడి సృష్టిస్తూ.. సామాన్యులను కూడా హతమారుస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కుర్షీద్‌ టీవీ ఛానెల్‌ వాహనాన్ని టార్గెట్‌ చేస్తూ దాడికి దిగారు. ఛానెల్‌కు సంబంధించిన వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో ఛానెల్‌లకు సంబంధించిన ఓ జర్నలిస్ట్‌, వాహన డ్రైవర్‌, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కుర్షీద్‌ […]

దారుణం.. ఓ ఛానెల్‌ వాహనంపై ఉగ్రదాడి.. జర్నలిస్ట్‌తో పాటుగా..
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కంటికి కనిపించని కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. ఉగ్రవాదులు మాత్రం.. ఎక్కడో ఓ చోట అలజడి సృష్టిస్తూ.. సామాన్యులను కూడా హతమారుస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన కుర్షీద్‌ టీవీ ఛానెల్‌ వాహనాన్ని టార్గెట్‌ చేస్తూ దాడికి దిగారు. ఛానెల్‌కు సంబంధించిన వాహనాన్ని ఐఈడీతో పేల్చేశారు. ఈ ఘటనలో ఛానెల్‌లకు సంబంధించిన ఓ జర్నలిస్ట్‌, వాహన డ్రైవర్‌, మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.కుర్షీద్‌ టీవీ చీఫ్ ఎడిటర్ రఫీ సిద్దిఖీ తెల్పిన ప్రకారం.. మొత్తం ఆరుగురు ఛానెల్‌ సిబ్బంది గాయపడ్డారని.. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై ఆఫ్ఘన్ ప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. ఘటనపై లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఇదిలావుంటే.. ఈ దాడిపై ఏ ఉగ్రసంస్థ కూడా తామే చేసినట్లు ప్రకటించలేదు.