AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కంకిపాడులోని జెడ్పీ పాఠశాలలో 'జగనన్న విద్యా కానుక' పధకాన్ని ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.

ఏపీలో స్కూల్స్ రీ-ఓపెన్‌కు డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే.!
Ravi Kiran
|

Updated on: Oct 06, 2020 | 7:52 PM

Share

Jagananna Vidya Kanuka Scheme: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 8వ తేదీన కంకిపాడులోని జెడ్పీ పాఠశాలలో ‘జగనన్న విద్యా కానుక’ పధకాన్ని ప్రారంభిస్తారని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ పధకం ద్వారా 43 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరుతుందని చెప్పారు. దీని కోసం సుమారుగా రూ. 650 కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. విద్యారంగంలో సంస్కరణలను అమలు చేసి.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తున్నామని మంత్రి సురేష్ చెప్పుకొచ్చారు. విద్యా కానుక కింద విద్యార్థులకు ఇచ్చే కిట్‌లో.. పుస్తకాలు, బ్యాగ్, షూస్, సాక్స్, స్కూల్ డ్రెస్ మొదలగునవి ఉంటాయన్నారు.

అలాగే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలకు అనుగుణంగా నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్ రూల్స్ పాటిస్తూ స్కూల్స్ ప్రారంభిస్తామని.. దీని కోసం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా, ఏపీలో ఇప్పటికే పలుమార్లు స్కూళ్ళు ప్రారంభిస్తామని చెప్పిన ప్రభుత్వం.. తర్వాత అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చింది. మరి ఈ తేదీకి ప్రభుత్వం స్కూళ్లు తెరుస్తుందా.? లేదా.? అనేది చూడాలి.

Follow Us