జనవరి 1 నుంచి దేశవాళీ సీజన్: గంగూలీ
ప్రకటన వచ్చేసింది. దేశవాళి క్రికెట్ సీజన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం వెల్లడించారు.
ప్రకటన వచ్చేసింది. దేశవాళి క్రికెట్ సీజన్ జనవరి 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం వెల్లడించారు. దీంతో యువ క్రికెటర్లు తమ సత్తా చాటాలని రెడీ అవుతున్నారు. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ శనివారం సాయంత్రం సమావేశమైంది. భారతదేశంలో పెరుగుతున్న కోవిడ్ వ్యాప్తి వల్ల గందరగోళంలో పడిన దేశీయ క్రికెట్ క్యాలెండర్ గురించి ఎక్కువ సమయం చర్చించారు. మీటింగ్ అనంతరం గంగూలీ మాట్లాడారు.
‘దేశవాళీ క్రికెట్పై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత వచ్చే జనవరి 1 నుంచి ఆ సీజన్ను స్టార్ట్ చెయ్యాలని చూచాయగా నిర్ణయం తీసుకున్నాం. కోవిడ్ వైరస్ పరిస్థితుల కారణంగా అన్ని టోర్నీలు నిర్వహించే చాన్స్ ఉండకపోవచ్చు. రంజీ ట్రోఫీని పూర్తిస్థాయిలో జరిపేందుకు అన్ని మార్గాలను అన్వేశిస్తున్నాం . రంజీ ట్రోఫీ కోసం జనవరి-మార్చి నెలల్లో నిర్వహణకు బీసీసీఐ ఫోకస్ పెట్టింది’ అని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ తెలిపారు.
జూనియర్ క్రికెట్, మహిళల టోర్నమెంట్లు మార్చి-ఏప్రిల్ మధ్య జరుగుతాయని దాదా చెప్పాడు. ఆస్ట్రేలియాలో ఇండియా టీమ్ పర్యటన గురించి గంగూలీ మాట్లాడుతూ… ‘క్రికెట్ ఆస్ట్రేలియా టూర్ మొత్తం వివరాలను పంపించింది. వాటిపై బీసీసీఐ అధికారులు పూర్తి స్థాయి చర్చలు జరుపుతారు. జనవరి మూడో వారంలోగా అక్కడ 4 టెస్టులు ఆడతాం. అక్కడికి వెళ్లాక క్వారంటైన్లో కూడా ఇండియన్ ప్లేయర్స్ సాధన చేస్తారు’ అని చెప్పారు. ఇంగ్లండ్తో జరుగనున్న స్వదేశీ సిరీస్ గురించి బీసీసీఐ రివ్యూ చేస్తుందని వివరించారు.
Also Read :