AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ తో చైనా కయ్యం ! లడఖ్ లో ఏం జరుగుతోంది ?

లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా క్రమంగా భారత్-చైనా మధ్య 'నిప్పు' రాజుకుంటోంది. భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందంలో కొంతమందిని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగంలోని మరికొంతమంది జవాన్లను చైనా దళాలు ఇటీవల నిర్బంధించి..

భారత్ తో చైనా కయ్యం ! లడఖ్ లో ఏం జరుగుతోంది ?
Umakanth Rao
| Edited By: |

Updated on: May 24, 2020 | 11:39 AM

Share

లడఖ్ లో వాస్తవాధీన రేఖ పొడవునా క్రమంగా భారత్-చైనా మధ్య ‘నిప్పు’ రాజుకుంటోంది. భారత ఆర్మీకి చెందిన పెట్రోలింగ్ బృందంలో కొంతమందిని, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు విభాగంలోని మరికొంతమంది జవాన్లను చైనా దళాలు ఇటీవల నిర్బంధించి.. ఆ తరువాత విడుదల చేసినట్టు తెలిసింది. అంతకుముందు ఉభయ పక్షాల మధ్య కొద్దిసేపు ఘర్షణ కూడా జరిగిందట. రెండు పక్షాల కమాండర్ల మధ్య బోర్డర్ లో సమావేశం జరిగిన అనంతరం ఉద్రిక్తత తగ్గి మళ్ళీ సాధారణ పరిస్థితి నెలకొన్నట్టు సమాచారం. లడఖ్ లోని పాంగాంగ్ సరస్సు సమీపంలో ఈ వారారంభంలో జరిగిన ఘటనలను భారత దళాలు ప్రధానమంత్రి కార్యాలయానికి వివరించాయి. గత బుధవారం ఇండియన్ జవాన్లకు, చైనా సైనికులకు మధ్య ఘర్షణ జరిగిన అనంతరం మనవాళ్లను కొందరిని వారు నిర్బంధంలోకి తీసుకున్నారని, కొంతసేపటికి వదిలివేశారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత జవాన్ల నుంచి చైనీయులు ఆయుధాలు కూడా లాక్కున్నట్టు ఆయన చెప్పారు.

భారత భూభాగంలోకి చైనా సైనికులు చొరబడ్డారని, పాంగాంగ్ లేక్ లో మోటార్ బోట్లతో ‘గస్తీ’ తిరిగారని కేంద్రానికి సమాచారం కూడా అందింది. ‘అది నిజానికి పెద్ద ఘటనే ! ప్రస్తుతానికి పరిస్థితి సద్దు మణిగింది. అలా అని ఇది ఇంతటితో సమసిపోతుందనుకోవడం పొరబాటే అవుతుంది’ అని సైనిక వర్గాలు పేర్కొన్నాయి. లడఖ్ లోని గల్వాన్ ప్రాంతం పొడవునా వేర్వేరు చోట్ల చైనా సైనికులు టెంట్లు (గుడారాలు) వేసినట్టు ఈ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కి ఎప్పటికప్పుడు తాము సమాచారాన్ని తెలియజేస్తున్నట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి. ఈ నెలారంభంలో లడఖ్ తూర్పు ప్రాంతంలోని వివాదాస్పద గగనతలంలో చైనా హెలికాఫ్టర్లు చక్కర్లు కొట్టిన విషయాన్ని కూడా ఇవి ప్రస్తావించాయి.