బైడెన్ ‘కరోనా టాస్క్ ఫోర్స్’ లో కో-చైర్మన్ గా ఇండో-అమెరికన్ డా. వివేక్ మూర్తి
అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ అప్పుడే దేశంలో కరోనా వైరస్ అదుపుపై దృష్టి పెట్టారు. ఇందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్ లో ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని కో-చైర్మన్ గా నియమించారు. ముగ్గురు సహ చైర్మన్లలో ఈయన కూడా ఒకరు. మాజీ యుఎస్ సర్జన్ జనరల్ అయిన మూర్తి.. ప్రజారోగ్య నిపుణుల బృందానికి, బైడెన్ కి, ఉపాధ్యక్షరాలిగా పదవి చేపట్టనున్న కమలా హారిస్ కి తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. అమెరికాలోని కనీసం 40 […]
అమెరికా నూతన అధ్యక్షునిగా ఎన్నికైన జో బైడెన్ అప్పుడే దేశంలో కరోనా వైరస్ అదుపుపై దృష్టి పెట్టారు. ఇందుకు ఉద్దేశించిన టాస్క్ ఫోర్స్ లో ఇండియన్-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని కో-చైర్మన్ గా నియమించారు. ముగ్గురు సహ చైర్మన్లలో ఈయన కూడా ఒకరు. మాజీ యుఎస్ సర్జన్ జనరల్ అయిన మూర్తి.. ప్రజారోగ్య నిపుణుల బృందానికి, బైడెన్ కి, ఉపాధ్యక్షరాలిగా పదవి చేపట్టనున్న కమలా హారిస్ కి తగిన సలహాలు, సూచనలు ఇస్తారు. అమెరికాలోని కనీసం 40 రాష్ట్రాల్లో కొత్తగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇవి 90 లక్షలకు పైగా పెరిగాయి, 2 లక్షల 36 వేలమంది కరోనా కాటుకు బలయ్యారు.