కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా నాలుగు నెలల నుంచి ఇంటికే పరిమితమైన ఇండియన్ క్రికెటర్లు తిరిగి ప్రాక్టీస్ ప్రారంభిస్తున్నారు. ఇప్పటికే బౌలర్ శార్దూల్ ఠాకూర్, టెస్ట్ బ్యాట్స్మెన్ పుజారా నెట్స్లో ప్రాక్టీస్ షురూ చేయగా.. ఇదే కోవలో భారత డాషింగ్ ఓపెనర్, వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సాధన మొదలుపెట్టాడు. తాజాగా అతడు ఔట్ డోర్ ట్రైనింగ్ సెషన్ పూర్తి చేసుకుని గ్రౌండ్లో సేద తీరుతున్న ఓ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ‘చాలా రోజుల తర్వాత పార్క్లో సాధన చేశాను. నాలో కొత్త ఉత్తేజం వచ్చినట్లు ఉందని పేర్కొన్నాడు’. కాగా, రోహిత్ శర్మ ఈ ఏడాది జరిగిన న్యూజిలాండ్ టీ20 సిరీస్ తర్వాత గాయం కారణంగా ఆటకు దూరమైనా సంగతి విదితమే.