AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో భారత, రష్యా నేవీ విన్యాసాలు

బంగాళాఖాతంలో ఇండియా, రష్యా నౌకా విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించనున్న వీటిని 'ప్యాసేజ్ ఎక్సర్ సైజ్' గా వ్యవహరిస్తున్నారు. సుమారు నెలరోజుల క్రితం భారత నేవీ..

బంగాళాఖాతంలో భారత, రష్యా నేవీ విన్యాసాలు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 02, 2020 | 5:13 PM

Share

బంగాళాఖాతంలో ఇండియా, రష్యా నౌకా విన్యాసాలను నిర్వహించనున్నాయి. ఈ నెల 4, 5 తేదీలలో నిర్వహించనున్న వీటిని ‘ప్యాసేజ్ ఎక్సర్ సైజ్’ గా వ్యవహరిస్తున్నారు. సుమారు నెలరోజుల క్రితం భారత నేవీ, యూఎస్ ఎస్ ‘నిమిట్జ్’ సంయుక్తంగా జరిపిన విన్యాసాల చోటే వీటిని కూడా నిర్వహించనున్నారు. నిమిట్జ్ అమెరికాకు చెందిన అతి పెద్ద యుధ్ధ నౌక. ఇక  రష్యా రెండు డిస్ట్రాయర్లను ఈ విన్యాసాల్లో వినియోగించబోతోంది. ఇండియా ‘రన్ విజయ్’, సహ్యాద్రి వంటి వినూత్న నౌకలను ఈ విన్యాసాల్లో ఉపయోగించుకోనుంది. భారత-రష్యా దేశాల నౌకా దళాల మధ్య సాన్నిహిత్యం, సమన్వయం కోసం ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నట్టు నేవీ వర్గాలు తెలిపాయి.

Follow Us