IND Vs NZ Test Series: కివీస్‌తో మొదటి టెస్ట్.. మరోసారి కోహ్లీ మార్క్ డెసిషన్.. బరిలోకి ఆ ఇద్దరు.?

|

Feb 20, 2020 | 9:44 PM

పొట్టి క్రికెట్‌ను మనం వైట్‌వాష్ చేస్తే.. వన్డేలను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ మరికొద్ది గంటల్లో ఆరంభం కాబోతోంది. వన్డేలలో చేసిన పొరపాట్లను...

IND Vs NZ Test Series: కివీస్‌తో మొదటి టెస్ట్.. మరోసారి కోహ్లీ మార్క్ డెసిషన్.. బరిలోకి ఆ ఇద్దరు.?
Follow us on

Ind Vs Nz Test Series: పొట్టి క్రికెట్‌ను మనం వైట్‌వాష్ చేస్తే.. వన్డేలను కివీస్ క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు టెస్ట్ సిరీస్ మరికొద్ది గంటల్లో ఆరంభం కాబోతోంది. వన్డేలలో చేసిన పొరపాట్లను పునరావృత్తం చేయకుండా పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని కోహ్లీసేన బరిలోకి దిగబోతుండగా.. న్యూజిలాండ్ ఫుల్ జోష్‌తో మొదలపెట్టబోతోంది.

Also Read: Virat Kohli Retirement Plans

ఇదిలా ఉంటే కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తమకు ఎంతో ముఖ్యమని మీడియా సమావేశంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు స్వదేశంలో ఒక్క మ్యాచ్ కూడా ఓటమిపాలవ్వని టీమిండియాకు ఈ టెస్ట్ సిరీస్ పెద్ద సవాల్‌గా మారుతుందని చెప్పాలి. అదే క్రమంలో కోహ్లీ బలమైన జట్టును ఎంపిక చేయనున్నాడని సమాచారం. ఈ తరుణంలోనే యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌లకు తుది జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. అంతేకాకుండా రవిచంద్రన్ అశ్విన్‌పై కూడా వేటు పడనున్నట్లు తెలుస్తోంది.

Also Read: ICC Womens T20 World Cup Schedule

ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌తో పాటుగా మరో ఓపెనర్ పృథ్వీ షా బరిలోకి దిగనుండగా.. మిడిల్ ఆర్డర్‌లో ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, హనుమ విహారీలు ఆడనున్నారు. ఇక వికెట్ కీపర్‌గా వృద్ధిమాన్ సాహా కొనసాగనుండగా.. ఆల్‌రౌండర్‌గా రవీంద్ర జడేజా.. ముగ్గురు పెసర్లుగా ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలు బరిలోకి దిగనున్నట్లు సమాచారం.

భారత్(అంచనా): మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, రహానే, హనుమ విహారీ, వృద్ధిమాన్ సాహా, రవీంద్ర జడేజా,  ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా

న్యూజిలాండ్(అంచనా): టామ్ లాథామ్, టామ్ బ్లండల్, కేన్ విలియమ్సన్, రాస్ టేలర్, హెన్రీ నికోలస్, బీజే వాట్లింగ్, కోలిన్ డి గ్రాండోమ్, జమీసొన్, సౌథీ, బౌల్ట్, మాట్ హెన్రీ