హైదరాబాద్ చేరుకున్న బీజేపీ నేత నడ్డా..

| Edited By: Pardhasaradhi Peri

Aug 18, 2019 | 2:26 PM

బీజేపీ జాతీయ  కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు.  ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  జరిగే పలు కార్యక్రమాలకు నడ్డా హాజరుకాన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఇక టీడీపీ నుంచి చాలమంది సీనియర్లు సైతం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా […]

హైదరాబాద్ చేరుకున్న బీజేపీ నేత నడ్డా..
Follow us on

బీజేపీ జాతీయ  కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణ పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు చేరుకున్నారు.  ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా  జరిగే పలు కార్యక్రమాలకు నడ్డా హాజరుకాన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సాగుతున్న బీజేపీ.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు బీజేపీలో చేరారు. ఇక టీడీపీ నుంచి చాలమంది సీనియర్లు సైతం బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. దాదాపుగా 20 వేలమంది బీజేపీలో చేరేందుకు రెడీగా ఉన్నారని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చెప్పారు. ఈ నేపధ్యంలో నడ్డా సమక్షంలో వీరి చేరికలు జరగనున్నాయి.