జమ్మూ కాశ్మీర్ లో కొత్త చట్టాలు, హురియత్ కాన్ఫరెన్స్ నిరసన

| Edited By: Pardhasaradhi Peri

Oct 28, 2020 | 8:03 PM

జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాల పట్ల ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 31 న పూర్తి బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. వీటిని  అబ్దుల్ గని భట్, బిలాల్ ఘని లోనె,  మస్రూర్ అబ్బాస్ వంటి నేతలు ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను బెదిరించడానికి, మానసికంగా వారిని వేధించడానికి ఈ విధమైన శాసనాలను తెస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని […]

జమ్మూ కాశ్మీర్ లో కొత్త చట్టాలు, హురియత్ కాన్ఫరెన్స్  నిరసన
Follow us on

జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా భూములు, ఆస్తులు కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం తెచ్చిన చట్టాల పట్ల ఆల్ పార్టీ హురియత్ కాన్ఫరెన్స్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ నెల 31 న పూర్తి బంద్ పాటించాలని పిలుపునిచ్చింది. వీటిని  అబ్దుల్ గని భట్, బిలాల్ ఘని లోనె,  మస్రూర్ అబ్బాస్ వంటి నేతలు ఖండించారు. జమ్మూ కాశ్మీర్ ప్రజలను బెదిరించడానికి, మానసికంగా వారిని వేధించడానికి ఈ విధమైన శాసనాలను తెస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తాము ఎదుర్కొని తీరుతామని, పెద్దఎత్తున ఆందోళన చేస్తామని అబ్దుల్ గని భట్ హెచ్చరించారు. జమ్మూ కాశ్మీరుపై ఏదో ఒక విధంగా పెత్తనం చలాయించడాన్ని  తాము సహించబోమన్నారు.