Huge Applications to HCU for PG Entrance : కరోనా భయంతో పరీక్షలను ప్రభుత్వాలు రద్దు చేస్తున్నా… విద్యార్థులు మాత్రం తమ చదువును పక్కన పెట్టడం లేదు. పోటీ పరీక్షలకు దరఖాస్తు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా..హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి.
పీజీ ఎంట్రెన్స్ టెస్ట్ కోసం అప్లై చేసినవారి సంఖ్య ఎన్నడూ లేనంతాగా ఈ ఏడాది వచ్చాయి. 62,853 మంది దరఖాస్తు చేసుకున్నట్లు హెచ్సీయూ పరీక్ష విభాగం తెలిపింది. కరోనా పరిస్థితులు మెరుగుపడిన తర్వాతే వీరికి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పరీక్షలు ఏ తేదీన నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.