శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం  ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి..

శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

Updated on: Aug 23, 2020 | 1:26 AM

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జె కె మహేశ్వరి శనివారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం  ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఈఓ శ్రీ సింఘాల్ ప్రధాన న్యాయమూర్తికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు.

తిరుమలలో కరోనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. భక్తుల కోరికతో ఆన్ లైన్ సేవలను ప్రారంభించారు. ఇందులో శ్రీవారి కళ్యాణ సేవ ఒకటి.   శ్రీనివాస నివాస కళ్యాణంను ఆన్ లైన్ ద్వారా భక్తులు దర్శించుకుంటున్నారు.  అనంతరం లడ్డూ ప్రసాదాన్ని అందిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us