ఐఎన్ఎక్స్ మీడియా కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరంపై అరెస్ట్ కత్తి వేలాడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆయనకు మద్దతుగా నిలిచారు. ఒక ఎక్స్ట్రీమ్ క్వాలిఫైడ్ అయిన, గౌరవ రాజ్యసభ సభ్యుడైన చిదంబరం దేశం కోసం కొన్ని దశాబ్దాల తరబడి విధేయుడిగా పనిచేస్తున్నాడని ప్రియాంక అన్నారు.ఈ క్రమంలో కేంద్రమంత్రిగానూ, ఆర్థికమంత్రిగానూ సేవలందించారని గుర్తుచేశారు. చిదంబరం నిస్సంకోచంగా నిజాలు మాట్లాడుతారని.. ప్రభుత్వ వైఫల్యాలను బయటపెడుతారని చెప్పారు. కానీ చిదంబరం చెప్పే నిజాలు జీర్ణించుకోలేక ఆయన్ను వెంటాడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి తరుణంలో తామంతా చిదంబరంకు అండగా నిలుస్తామని.. నిజం మాట్లాడటం కోసం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రియాంక ట్వీట్లో ఎక్కడా బీజేపీ గురించి ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా వారినే టార్గెట్ చేసినట్టు కనబడింది. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందునే చిదంబరంపై కక్ష గట్టి కేసులతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు.
An extremely qualified and respected member of the Rajya Sabha, @PChidambaram_IN ji has served our nation with loyalty for decades including as Finance Minister & Home Minister. He unhesitatingly speaks truth to power and exposes the failures of this government,
1/2— Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 21, 2019