వ్యవసాయ బిల్లులకు నిరసనగా ఆదివారం హర్యానాలో ఆదివారం రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. ఈ బిల్లులు తమకు నష్టం కలిగించేవేనని, తమ ప్రయోజనాలకు పూర్తి విరుధ్ధమని ఆరోపిస్తున్న అన్నదాతలు జాతీయ రహదారులపై రాస్తారోకో ఆందోళన చేపట్టారు. ఈ బిల్లులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. వీరి ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు హర్యానా పోలీసులతో బాటు ఢిల్లీ పోలీసులు కూడా భారీ సంఖ్యలో మోహరించారు. అటు పంజాబ్ లో కూడా రైతులు నిరసనలతో నేషనల్ హైవేలను హోరెత్తించారు.
హర్యానా, పంజాబ్ మంత్రుల్లో పలువురు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నారు. వీటి వల్ల అన్నదాతలకు మేలు జరగకపోగా కీడే జరుగుతుందని, వీటిని ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Haryana: Farmers protest new agriculture law by blocking major road in Sirsa
"The govt should make laws making it punishable for private buyers to procure farm produces below MSPs. This will guarantee our sales," says a protester. pic.twitter.com/0fq64zQDd8
— ANI (@ANI) September 20, 2020