ఆ పెళ్లిలో ‘చెత్త’ గోల.. రూ.2.5లక్షల భారీ జరిమానా

| Edited By: Pardhasaradhi Peri

Jul 01, 2019 | 12:18 PM

ఉత్తరాఖండ్‌లోని ఔలి కొండ ప్రాంతంలో ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. రూ.200కోట్లు ఖర్చు చేసిన ఈ వివాహానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహం తరువాత ఆ ప్రాంతంలో సుమారు 321 క్వింటాళ్ల చెత్త పోగయ్యింది. ఈ క్రమంలో గుప్తా కుటుంబానికి జోషిమత్ మున్సిపాలిటీ శాఖ రూ. 2.5లక్షల భారీ జరిమానా విధించింది. పెళ్లి తరువాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న […]

ఆ పెళ్లిలో ‘చెత్త’ గోల.. రూ.2.5లక్షల భారీ జరిమానా
Follow us on

ఉత్తరాఖండ్‌లోని ఔలి కొండ ప్రాంతంలో ఇటీవల గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు జరిగిన విషయం తెలిసిందే. రూ.200కోట్లు ఖర్చు చేసిన ఈ వివాహానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఈ వివాహం తరువాత ఆ ప్రాంతంలో సుమారు 321 క్వింటాళ్ల చెత్త పోగయ్యింది. ఈ క్రమంలో గుప్తా కుటుంబానికి జోషిమత్ మున్సిపాలిటీ శాఖ రూ. 2.5లక్షల భారీ జరిమానా విధించింది. పెళ్లి తరువాత మిగిలిన చెత్తను ఖాళీగా ఉన్న ప్రదేశంలో పడేయడంతో ఈ జరిమానా విధించినట్లు జోషిమత్ మున్సిపాలిటీ అధికారి సత్యపాల్ నౌతియాల్ తెలిపారు. చెత్తను అలాగే వదిలేసినందుకు రూ.1.5లక్షలు, ఖాళీ స్థలంలో వేసినందుకు మరో లక్ష జరిమానాను విధించినట్లు వారు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి కూడా రూ.8.14లక్షల బిల్లును పంపినట్లు అధికారులు తెలిపారు.