మరో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్.. ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు

|

Dec 19, 2020 | 6:00 PM

ఉద్యోగుల భద్రత అధిక ప్రాధాన్యత ఇచ్చే ఃప్రముఖ టెక్ సంస్థ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రకటించింది.

మరో కీలక నిర్ణయం తీసుకున్న గూగుల్.. ఉద్యోగులందరికీ ఉచితంగా కరోనా పరీక్షలు
Follow us on

ఉద్యోగుల భద్రత అధిక ప్రాధాన్యత ఇచ్చే ఃప్రముఖ టెక్ సంస్థ గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాలోని ప్రతి గూగుల్ ఉద్యోగికి ఉచితంగా కరోనా పరీక్షలు చేయిస్తామని ప్రకటించింది. వారానికి ఒకసారి ప్రతి ఉద్యోగి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని గూగుల్ ప్రతినిధి ఒకరు తెలిపారు, సూచించింది. అంతేకాకుండా, వచ్చే ఏడాది కల్లా ప్రపంచవ్యాప్తంగా ప్రయోజనాన్ని విస్తరించాలని యోచిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని పేర్కొంది. గూగుల్ తాజా నిర్ణయంతో అమెరికాలోని దాదాపు 90 వేల మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. కరోనా టెస్టుల కోసం గూగుల్ ఉద్యోగులు తమ ఇంటి వద్దే శాంపిళ్లు సేకరించి ల్యాబుల్లో పరిక్షిస్తారని సమాచారం. అయితే, ఈ పరిక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధన ఏమీ లేదని కూడా కంపెనీ తమ ప్రకటనలో స్పష్టం చేసింది.