భారీగా గంజాయి పట్టివేత… ఇద్దరి అరెస్ట్..

| Edited By:

Jun 23, 2020 | 6:10 PM

ఏపీ నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

భారీగా గంజాయి పట్టివేత... ఇద్దరి అరెస్ట్..
Follow us on

ఏపీ నుంచి రాజస్థాన్‌కు గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని నారాయణపురం జాతీయ రహదారిపై చేబ్రోలు పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో గుజరాత్‌ నంబర్ ప్లేటుతో ఉన్న ఓ కారు.. అనుమానాస్పద స్థితిలో రావడాన్ని గమనించారు. దీంతో కారును ఆపి తనిఖీలు చేపట్టగా.. అందులో పెద్ద ఎత్తున గంజాయిని గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలుల రూ.4.70 లక్షలు ఉంటుందని.. పోలీసులు తెలిపారు. మొత్తం 98.5 కిలోల గంజాయితో పాటు.. కారును కూడా సీజ్ చేశామని పోలీసులు పేర్కొన్నారు. విశాఖపట్నం నుంచి రాజస్థాన్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు.