నన్ను చంపేస్తారు… నాకు బేడీలు వేయండి…!

గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో కరడుగట్టిన నేరగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్థావరాలను మార్చేస్తున్నారు. కొందరు రాష్ట్రాలను సైతం దాటి పోతున్నారు. కనీసం తమ నీడను..

నన్ను చంపేస్తారు... నాకు బేడీలు వేయండి...!

Updated on: Jul 11, 2020 | 9:13 PM

Gangster Lawrence Bishnoi : గ్యాంగ్‌స్టర్ వికాస్ దూబే ఎన్‌కౌంటర్‌తో కరడుగట్టిన నేరగాళ్లు భయంతో వణికిపోతున్నారు. ఒకరి తర్వాత ఒకరు స్థావరాలను మార్చేస్తున్నారు. కొందరు రాష్ట్రాలను సైతం దాటి పోతున్నారు. కనీసం తమ నీడను కూడా నమ్మడం లేదట. అనుచరులను సైతం వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారట. ఇదే వరసలో హరియాణాకు చెందిన ఓ గ్యాంగ్‌స్టర్ ‘కాపాడండి మహాప్రభో’ అంటూ కోర్టుకెక్కాడు.

తనను నకిలీ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారంటూ చండీగఢ్ కోర్టును గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఆశ్రయించాడు. ప్రస్తుతం చండీగఢ్ జైల్లో ఉంటున్నాడు. ఇతని నేరాలపై విచారణ జరుగుతోంది. తనను కూడా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేసే ప్రమాదం ఉందంటూ కోర్టును ఆశ్రయించాడు.

పంజాబ్, రాజస్థాన్‌లో చాలా నేరాలకు పాల్పడిన లారెన్స్.. తనను కోర్టుకు తెచ్చేప్పుడైనా, ఎక్కడకు వెళ్లేప్పుడైనా బేడీలు వేయాల్సిందిగా కోర్టుకు విన్నవించుకున్నాడు. తద్వారా తనను ఎన్‌కౌంటర్ చేసే అవకాశాలు తగ్గుతాయని లారెన్స్ అభిప్రాయం. మరి కోర్టు ఏం తీర్పు చెబుతుందో చూడాలి…

Loading...
Unable to load recommendations.
Follow Us