ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై గురువారం బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ పని ఆ పార్టీ గూండాలదే అని ఆప్ ఆరోపించింది. సిసోడియా కుటుంబ సభ్యుల భద్రతకు ఉద్దేశించిన పోలీసుల సహకారంతోనే వారీ ఎటాక్ కు పాల్పడ్డారని పేర్కొంది. సిసోడియా ఇంట్లోలేని సమయంలో ఈ ఘటన జరిగింది. ఆప్ నేతలు రాఘవ్ చద్దా, అతిషి ఈ వీడియోను ఆన్ లైన్ లో పోస్ట్ చేశారు. కొద్ధి సంఖ్యలో ఉన్న పోలీసులను కూడా తోసుకుంటూ బీజేపీ కార్యకర్తలు సిసోడియా ఇంటిలోకి దూసుకురావడం ఈ వీడియోలో కనిపించింది. వీరిలో ఒకరి చేతిలో అసాల్ట్ రైఫిల్ కూడా ఉన్నట్టు కనిపించిందని రాఘవ్ చద్దా అన్నారు. ఈ గుంపును అడ్డగించడానికి పోలీసులు చేసిన యత్నం ఫలించలేదు. తన నివాసంపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న సిసోడియా.. ఇదంతా ఓ పథకం ప్రకారం జరిగిందని ఆరోపించారు. నేను ఇంట్లో లేనప్పుడు బీజేపీ గూండాలు నా ఇంట్లోకి చొరబడి నా భార్యా పిల్లలపై దాడికి యత్నించారని ఆయన ట్వీట్ చేశారు. అటు- హోం మంత్రి అమిత్ షా సూచనపై ఈ దాడి జరిగిందని రాఘవ్ చద్దా పేర్కొన్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ ఎటాక్ ను తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్ చేశారు. ఈ ఘటనకు అమిత్ షాయే బాధ్యులని ఆరోపించారు.
I strongly condemn the systematic, organised and violent attack on Dy CM Sh Manish Sisodia’s home. The goons entered his house in police presence when he was away.
Why is BJP getting so desperate by the day in Delhi?
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 10, 2020