జిమ్ తెరిచారు.. చిక్కుల్లో పడ్డారు

|

Jul 18, 2020 | 5:31 PM

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అందులో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే అన్ లాక్ 2.0లో చాలా పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ ను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఇలావుంటే..  శారీరక దారుడ్యాన్ని పెంచుకునే జిమ్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. జిమ్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి.. వాటికి అనుమతులు నిరాకరించారు. అయితే కొందరు కరోనా […]

జిమ్ తెరిచారు.. చిక్కుల్లో పడ్డారు
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. అందులో దేశ రాజధాని ఢిల్లీ, వాణిజ్య రాజధాని ముంబైలో మహమ్మారి వ్యాప్తి అధికంగా ఉంది. అయితే అన్ లాక్ 2.0లో చాలా పరిశ్రమలకు, వాణిజ్య సముదాయాలకు, హోటల్స్ ను తెరిచేందుకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.

ఇది ఇలావుంటే..  శారీరక దారుడ్యాన్ని పెంచుకునే జిమ్ లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. జిమ్ చేస్తున్న సమయంలో కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది కాబట్టి.. వాటికి అనుమతులు నిరాకరించారు. అయితే కొందరు కరోనా కట్టడిని తుంగలో తొక్కి.. జిమ్‌లను తెరుస్తున్నారు.

అయితే ఢిల్లీ లోని శివపురి కాలనీలో ఓ జిమ్‌ను అనుమతి లేకుండా తెరిచారు. ముఖానికి మాస్క్‌లు లేకుండా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా జిమ్‌ను తెరిచినట్టు సమాచారం రావడంతో పోలీసులు దాడులు నిర్వహించారు.