విద్యార్థులు చివ‌రి సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే..తేల్చి చెప్పిన కేంద్రం

యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు.

విద్యార్థులు చివ‌రి సెమిస్ట‌ర్ ఎగ్జామ్స్ రాయాల్సిందే..తేల్చి చెప్పిన కేంద్రం

Updated on: Jul 13, 2020 | 7:14 PM

యూనివ‌ర్సిటీల‌లో చివరి సెమిస్టర్ ఎగ్జామ్స్ తప్పక నిర్వహించాలని వర్సిటీలకు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) మార్గదర్శకాలు సంగ‌తి తెలిసిందే. ఈ నిర్ణ‌యంపై ఆరు రాష్ట్రాలు అభ్యంతరాలు తెలిపిన‌ప్ప‌టికీ సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ వెన‌క‌డుగు వెయ్య‌డం లేదు. యూజీసీ జారీచేసిన మార్గదర్శకాలతో ముందుకు వెళ్లాల్సిందేన‌ని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ తేల్చి చెప్పింది.

అక‌డ‌మిక్ ఇయ‌ర్ లో స్టూడెంట్ ఎంతమేర నేర్చుకున్నాడనే విషయమై వాల్యువేష‌న్ చేయడం అనేది.. విశ్వసనీయత, జాబ్ అవకాశాలకు కీలకమైన అంశమని వివ‌రించింది. వివిధ కోర్సుల్లో ఫైన‌ల్ ఇయ‌ర్ చదువుతున్న విద్యార్థులకు ఆఖరి సెమిస్టర్ ఎగ్జామ్స్ జులైలో నిర్వహించాలని గతంలో చెప్పిన‌ యూజీసీ..కోవిడ్ నేప‌థ్యంలో వాటిని సెప్టెంబరులోపు జరపాలని పోయిన‌వారం సూచించింది.

“చివరి సెమిస్టర్‌ విద్యార్థులకు వెంటనే ఎగ్జామ్స్ నిర్వహించాలని యూజీసీ చెప్ప‌లేదు. సెప్టెంబరు పూర్తయ్యేలోపు కంప్లీట్ చెయ్యాలి. గడువులోగా తమకు వీలైనప్పుడు ఎగ్జామ్స్ నిర్వహించేందుకు రాష్ట్రాలు తేదీలు నిర్ణయించుకోవచ్చు. మొత్తంగా ఎగ్జామ్స్ ఉండకపోవడం అనేది సాధ్యమయ్యే పనికాదు” అని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖలోని సీనియర్ ఆఫిస‌ర్ ఒకరు చెప్పారు.