దేశంలో 27 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు

|

Aug 18, 2020 | 10:26 AM

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనేఉంది. రోజు రోజుకీ విస్తరిస్తున్న కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తంగ కేసుల సంఖ్య 27 లక్షల మార్క్ దాటేసింది.

దేశంలో 27 లక్షల మార్క్ దాటిన కరోనా కేసులు
Follow us on

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనేఉంది. రోజు రోజుకీ విస్తరిస్తున్న కేసులతో జనం భయాందోళనలకు గురవుతున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తంగ కేసుల సంఖ్య 27 లక్షల మార్క్ దాటేసింది. కాకాపోతే, మొన్నటి వరకు 60వేలకుపైగా నమోదైన కేసులు కాస్త తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,079 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 27,02,743కు చేరుకుంది. ఇక, ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 6,73,166 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. వైరస్‌ బారినపడిన 19,77,780 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో తాజాగా 24 గంటల్లో 876 మంది మరణించగా, ఇప్పటివరకు మొత్తం నమోదైన మృతుల సంఖ్య 51,797 చేరాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో సోమవారం ఒక్కరోజే 8,99,864 పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. ఇప్పటి వరకు 3,09,41,264 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్‌ వివరించింది.