ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!

|

Jul 31, 2020 | 3:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిల్లో దాదాపు 50 శాతం పైగా కేసులు కేవలం నాలుగు జిల్లాలలోనే ఉన్నాయి.

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!
Follow us on

Corona Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,30,557 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వీటిల్లో దాదాపు 50 శాతం పైగా కేసులు కేవలం నాలుగు జిల్లాలలోనే ఉన్నాయి. అవే తూర్పుగోదావరి, గుంటూరు, కర్నూలు, అనంతపురం. కరోనా టెస్టులు పెంచుతున్న కొద్దీ ఎక్కువగా పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అటు రాష్ట్రంలో 1281 మంది వైరస్ కారణంగా మరణించారు.

ముఖ్యంగా రాష్ట్రంలోని నాలుగు జిల్లాలలోనే గత వారం రోజులుగా ప్రతీసారి అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీనితో స్థానిక పరిస్థితిని బట్టి అధికారులు మళ్లీ కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ నాలుగు జిల్లాలు హైరిస్క్ ప్రాంతాలుగా మారాయి. ప్రజలు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని.. మాస్క్ లేకుండా బయటికి రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. అలాగే భౌతిక దూరాన్ని కూడా తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఇక కొన్ని చోట్ల అయితే మరోసారి కఠిన లాక్ డౌన్‌ను విధిస్తున్నారు.

కాగా, తూర్పుగోదావరిలో ఇప్పటివరకు 19,180 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వైరస్ కారణంగా 157 మంది మరణించారు. అలాగే అనంతపురంలో 13,312 పాజిటివ్ కేసులు, 105 మరణాలు సంభవించాయి. ఇక గుంటూరులో పాజిటివ్ కేసుల సంఖ్య 13,762కు చేరగా.. 121 మంది వైరస్ కారణంగా మృతి చెందారు. కర్నూలులో పాజిటివ్ కేసుల సంఖ్య 15,723కు చేరుకుంది. అటు వైరస్ కారణంగా 187 మంది చనిపోయారు. ఇక రాష్ట్రంలోని అనంతపురం(105), చిత్తూరు(101), తూర్పుగోదావరి(157), గుంటూరు(121), కృష్ణా(160), కర్నూలు(187), విశాఖపట్నం(100) జిల్లాల్లో ఎక్కువ కరోనా మరణాలు సంభవించాయి.

Also Read:

మహిళల కోసం మరో రెండు పధకాలు.. జగన్ సర్కార్ సంచలనం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షల కేంద్రాల వివరాలివే.!

తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆగష్టు 15 నుంచి వీడియో పాఠాలు!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై ప్లాస్టిక్ పూర్తిగా బ్యాన్.!