ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు అభినందనలు

|

Dec 09, 2020 | 10:55 AM

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలిపారు.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు అభినందనలు
Follow us on

ప‌్ర‌ధాని న‌రేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. పార్ల‌మెంట్ కొత్త భ‌వ‌న స‌ముదాయానికి ఈ నెల 10న ప్ర‌ధాని మోదీ భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో కేసీఆర్ అభినంద‌న‌లు తెలుపుతూ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాప‌న చేస్తుండ‌టం సంతోషంగా ఉంద‌ని కేసీఆర్ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు దేశ సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని సీఎం కొనియాడారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడో చేప‌ట్టాల్సి ఉండేదని.. ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంట్ భ‌వ‌నం స‌రిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ ప్రాజెక్టు త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.