40వేల కేజీల చెత్తను మిగిల్చిన రూ.200కోట్ల వివాహం

| Edited By:

Jun 24, 2019 | 10:39 AM

ప్రముఖ పారిశ్రామిక వేత్త గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జరిగిన విషయం తెలిసిందే. ఔళీ కొండ ప్రాంతంలో జూన్ 18 నుంచి 22 మధ్య గుప్త కుటుంబసభ్యులైన సూర్యకాంత్, శశాంక్ వివాహాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వివాహాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ స్టార్లు, యోగా గురు బాబా రాందేవ్ తదితరులు హాజరయ్యారు. రాందేవ్ బాబా అయితే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ రెండు గంటల పాటు యోగాను కూడా నిర్వహించారు. ఇదంతా […]

40వేల కేజీల చెత్తను మిగిల్చిన రూ.200కోట్ల వివాహం
Follow us on

ప్రముఖ పారిశ్రామిక వేత్త గుప్తా కుటుంబానికి చెందిన రెండు వివాహాలు ఇటీవల ఉత్తరాఖండ్‌లోని జరిగిన విషయం తెలిసిందే. ఔళీ కొండ ప్రాంతంలో జూన్ 18 నుంచి 22 మధ్య గుప్త కుటుంబసభ్యులైన సూర్యకాంత్, శశాంక్ వివాహాలు అట్టహాసంగా జరిగాయి. ఈ వివాహాలకు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, బాలీవుడ్ స్టార్లు, యోగా గురు బాబా రాందేవ్ తదితరులు హాజరయ్యారు. రాందేవ్ బాబా అయితే యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అక్కడ రెండు గంటల పాటు యోగాను కూడా నిర్వహించారు.

ఇదంతా పక్కనపెడితే ఈ వివాహం అక్కడ భారీగా చెత్తను మిగిల్చింది. దానిని తొలగించడం అక్కడి మున్సిపాలిటీ వారికి చాలా కష్టంగా మారింది. ప్రస్తుతం అక్కడి చెత్తను తీసేందుకు దాదాపుగా 20మంది శ్రామికులు కష్టపడుతున్నారు. ‘‘ఈ వివాహం తరువాత కొండ ప్రాంతంలో చాలా చెత్త మిగిలింది ఇదంతా 40వేల కేజీలు ఉండొచ్చు’’ అని అక్కడ పనిచేసే ఓ శ్రామికుడు పేర్కొన్నాడు. మరోవైపు ఈ వివాహం గురించి ఓ స్థానిక వ్యక్తి మాట్లాడుతూ.. ‘‘ఇక్కడ చాలా ప్లాస్టిక్ పాకెట్లు, బాటిల్స్ పడిపోయాయి. మా పశువులు ఇక్కడే తిరుగుతుంటాయి. ఒకవేళ అవి ఆ ప్లాస్టిక్‌ను తింటే వాటి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?’’ అని ప్రశ్నించాడు. కాగా ఈ వివాహం వలన ఔళీ కొండ ప్రాంతంలోని అటవీసంపదకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఓ సామాజిక కార్యకర్త పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.