నిర్లక్ష్యంగా కారు నడిపిన యువకుడు.. చిన్నారి మృతి

|

Sep 27, 2020 | 7:17 PM

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది

నిర్లక్ష్యంగా కారు నడిపిన యువకుడు.. చిన్నారి మృతి
Follow us on

నిజామాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లో విగతజీవిగా మారింది. యువకుడి నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని శివం అపార్ట్‌మెంట్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పార్కింగ్ సెల్లార్‌లో యువకుడు అజాగ్రత్తగా కారు నడిపి చిన్నారి చావుకు కారణమయ్యాడు. వచ్చిన డ్రైవింగ్ తో సెల్లార్ లో ఆడుకుంటున్న వాచ్‌మెన్ కూతురు మనిశ్వీపై నుంచి కారును తీసువెళ్లాడు. ఈ ప్రమాదంలో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్లముందే కన్నకూతురు కానరాని లోకాలకు పోవడంతో ఆ తల్లదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనకు సంబందించి విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.