నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..

| Edited By:

Apr 10, 2020 | 3:36 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు

నాన్ వెజ్ ప్రియులకు షాక్.. భారీగా పెరగనున్న చికెన్ ధరలు..
Follow us on

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. కరోనా భయంతో మొన్నటివరకు కిలో బ్రాయిలర్‌ చికెన్‌ రూ.25-50 లోపే ధర పలికింది. చివరకు బతికున్న కోడిని రూ.25కు ఇచ్చినా తీసుకునేవారు లేరు. పెంపకం, మేత ఖర్చులు కూడా రాక రైతులు నష్టాలను చవిచూశారు. దీనివల్ల కొన్నిచోట్ల కోళ్లను మేపలేక మిన్నకుండిపోయారు. మరికొన్ని చోట్ల గొయ్యి తీసి పాతేశారు. ఈ పరిణామాలతో 60శాతం కోళ్ల ఫారాల్లో కోళ్లే లేకుండా పోయాయి. కొన్నిచోట్లే అరకొరగా మిగిలాయి. ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కూడా కొత్త కోడిపిల్లల బ్యాచ్‌లను పెంచడం ఆపేశాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మాంసం ప్రియులు ఇపుడు మళ్లీ చికెన్‌పై పడ్డారు.

కాగా.. డిమాండ్‌ ఏర్పడటంతో కిలో చికెన్‌ ధర రూ.190-250కు చేరుకుంది. ఈ పరిస్థితులను గమనించిన ఇంటిగ్రేషన్‌ కంపెనీలు కోడిపిల్లలను పెంచడానికి పోటీలు పడుతున్నాయి. తక్కువ ధరలకే కోడిపిల్లలను సరఫరా చేస్తామని, పెంచడానికి కమీషన్‌ కూడా ఎక్కువగా ఇస్తామని పత్రికల్లో ప్రకటనలను ఇస్తున్నాయంటే రానున్న రోజుల్లో చికెన్‌ వ్యాపారం ఏ విధంగా ఉండబోతోందో అర్థమవుతుంది. కొందరైతే రైతుల ఇళ్లవద్దకెళ్లి ఒప్పందాలను సైతం కుదుర్చుకుంటున్నారు. అయినా కంపెనీలు కోడిపిల్లల్ని ఉత్పత్తి చేసి ఫారాలకు సరఫరా చేయాలంటే కనీసం 45 రోజుల సమయం పడుతుంది. అప్పటివరకు ప్రస్తుతం ఉన్న స్టాకు సరిపోకుంటే చికెన్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో కేంద్రమంత్రి హర్షవర్థన్ సమావేశం