ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ నుంచి బెంగళూరు బయల్దేరివెళ్లారు. ఓట్ల లెక్కింపు సమీపిస్తున్న వేళ విపక్ష పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు.. బెంగళూరులో జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ కానున్నారు. అక్కడి నుంచి రేపు ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లా కుప్పం వెళ్లనున్నారు. కుప్పంలో గంగమ్మ జాతరలో పాల్గొననున్న సీఎం దంపతులు.. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం అక్కడి నుంచి చంద్రబాబు విజయవాడ వెళ్లనున్నారు.