నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు బీజేపీలో చేరడంపై ఆపార్టీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు స్పందించారు. లోక్సభలో పూర్తి మెజారిటీని సాధించిన తమ పార్టీకి రాజ్యసభలో కూడా మెజారిటీ కోసమే వీరిని చేర్చుకున్నామని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల నాటికి ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని శక్తిగా మారనుందన్నారు. రాజ్యసభలో సంఖ్యా పరమైన ఇబ్బందుల్ని అధిగమించి కీలకమైన బిల్లులను ఆమోదింపజేసుకునే విషయంలో ఎలాంటి అవరోధం ఎదురుకాబోదని ధీమా వ్యక్తం చేశారు జీవీఎల్.