బీసీసీఐ కరోనా విరాళం రూ.51 కోట్ల..!

|

May 29, 2020 | 2:45 PM

దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్నవేళ సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల వరకు అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాజాగా బీసీసీఐ 51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. బీసీసీఐ తరుపును ఈ మొత్తాన్ని కేంద్రానికి అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చింది బీసీసీఐ. ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అయా […]

బీసీసీఐ కరోనా విరాళం రూ.51 కోట్ల..!
Follow us on

దేశాన్ని కరోనా మహమ్మారి కబళిస్తున్నవేళ సాయం చేసేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. సామాన్యులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల వరకు అందరూ తమకు తోచినంత సాయం ప్రకటిస్తూ ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వానికి సహకరించేందుకు తాజాగా బీసీసీఐ 51 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చింది. బీసీసీఐ తరుపును ఈ మొత్తాన్ని కేంద్రానికి అధ్యక్షులు సౌరవ్ గంగూలీ అందజేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది. విపత్కర సమయంలో ఏకతాటిపైకి వచ్చి కోవిడ్ మహమ్మారిపై యుద్ధానికి ముందుకొచ్చింది బీసీసీఐ. ఇప్పటికే మాజీ క్రికెటర్లు, అయా రాష్ట్రాల క్రికెట్ బోర్డులు తమ వంతు సాయాన్ని అందించారు. కొవిడ్-19 ను పారదోలే వరకు వెన్నంటే ఉంటామంటున్నారు. కరోనా పోరులో యోధులకు, బాధితులకు బీసీసీఐ భరోసా కల్పిస్తోంది.