జాతీయ పతాకం ఆవిష్కరించిన బాలకృష్ణ

|

Aug 15, 2020 | 11:14 PM

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశప్రజలకు నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు.

జాతీయ పతాకం ఆవిష్కరించిన బాలకృష్ణ
Follow us on

74వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా దేశప్రజలకు నందమూరి నట సింహం బాలకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన బసవ తారకం కాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ పతాకాన్ని ఎగరవేసారు. ఈ ఉదయం చిరు జల్లలు పడుతున్నా.. జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నో ఏళ్ల పాటు ఆంగ్లేయుల బానిస సంకెళ్లలతో నలిగిపోయిన భారతావనిని కబంధ హస్తాల నుండి విడిపించి.. మన స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం అశువులు బాసిన ఎందరో సమరయోధుల త్యాగ దీక్షా దక్షతలను స్మరించుకున్నారు.