ప్రముఖ కమేడియన్ పృథ్వీ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కాలినడకన తిరుమల వెళ్లిన పృథ్వీ, శ్రీవారికి తన తలనీలాలను సమర్పించుకున్నారు. ఆయనకు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందించారు టీటీడీ ఆలయ అధికారులు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. జగన్ అన్ననే సీఎం కావాలని శ్రీవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమరావతిలో వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, పార్టీకి 100 సీట్లు తథ్యమని పేర్కొన్నారు. గతంలో ఈయన జగన్ వెంట పాదయాత్రలో పాల్గొన్న విషయం తెలిసిందే.