భారత కీపర్​కు సారీ చెప్పిన మ్యాక్స్​వెల్, ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగింది?

|

Nov 28, 2020 | 1:28 PM

ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​.. భారత క్రికెటర్ కేఎల్​ రాహుల్​కు సారీ చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ వేదికగా వివరించాడు.

భారత కీపర్​కు సారీ చెప్పిన మ్యాక్స్​వెల్, ఎందుకు చెప్పాడు? అసలు ఏం జరిగింది?
Follow us on

ఆస్ట్రేలియా ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్​వెల్​.. భారత క్రికెటర్ కేఎల్​ రాహుల్​కు సారీ చెప్పాడు. ఈ విషయాన్ని అతడే ట్విట్టర్​ వేదికగా వివరించాడు. భారత్-ఆసీస్ ఫస్ట్ వన్డే సందర్భంగా ఈ సీన్ జరిగింది.

అసలు ఏమైందంటే :

ఇటీవల యూఏఈలో జరిగిన ఐపీఎల్​లో మ్యాక్స్​వెల్ పంజాబ్​ తరఫున ఆడాడు. అయితే అతడు ఈ సీజన్‌లో దారుణంగా విఫలమయ్యాడు. 13 మ్యాచ్​ల్లో కేవలం 108 రన్స్ మాత్రమే చేశాడు. సీజన్​ మొత్తంలో ఒక్క సిక్స్ కూడా కొట్టలేకపోయాడు. అక్కడి నుంచి నేరుగా స్వదేశానికి చేరుకున్న మ్యాక్స్​వెల్.. ఇండియాతో శుక్రవారం జరిగిన ఫస్ట వన్డేలో చెలరేగిపోయాడు. 19 బంతుల్లో 45 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి.

ఐపీఎల్​లో కేఎల్​ రాహుల్​ సారథ్యంలో ఆడిన మ్యాక్స్​వెల్.. అతడు కీపింగ్​ చేస్తుండగా, తొలి వన్డేలో విధ్వంసకర ఇన్నింగ్స్​తో అదరగొట్టాడు. దీనిపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి. వీటిపై స్పందించిన కివీస్ క్రికెటర్ జిమ్మీ నీషన్.. మ్యాక్స్​వెల్​ను ట్యాగ్​ చేసి ఓ ప్రశ్న ఆడిగాడు. దీంతో “నేను బ్యాటింగ్​ చేస్తుండగా అతడికి సారీ చెప్పాను” అని మ్యాక్సీ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇది ఇంటర్నెట్‌లో తెగ సర్కులేట్ అవుతుంది.