కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మిస్తాం : మంత్రి వెల్లంపల్లి

|

Sep 21, 2020 | 3:27 PM

రాష్ట్ర అభివృద్ధికి, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలకు స్వామి ఆశీస్సులు కావాలని స్వరూపాన౦దే౦ద్ర స్వామిని కోరామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తమ ప్రభుత్వం పై రాజకీయ కుట్రలు సాగుతున్నాయని.. ప్రజలను అయోమయం చేసే ఘటనలు ఈ మధ్య కాల౦లో జరిగాయని మంత్రి తెలిపారు. ఆయా ఘటనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్యాక్రాంతం అయిన దేవాలయాల భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు జగన్ మోహన్ రెడ్డి […]

కూలగొట్టిన ఆలయాలు తిరిగి నిర్మిస్తాం : మంత్రి వెల్లంపల్లి
AP Minister vellampalli srinivasa rao mother passes away
Follow us on

రాష్ట్ర అభివృద్ధికి, సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టే సంక్షేమ పథకాలకు స్వామి ఆశీస్సులు కావాలని స్వరూపాన౦దే౦ద్ర స్వామిని కోరామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు చెప్పారు. తమ ప్రభుత్వం పై రాజకీయ కుట్రలు సాగుతున్నాయని.. ప్రజలను అయోమయం చేసే ఘటనలు ఈ మధ్య కాల౦లో జరిగాయని మంత్రి తెలిపారు. ఆయా ఘటనలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తున్నామని మంత్రి తెలిపారు. అన్యాక్రాంతం అయిన దేవాలయాల భూములను వెనక్కు తీసుకోవడంతో పాటు వాటి పరిరక్షణకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కృష్ణా పుష్కరాలతో సంబంధం లేకపోయినా టీడీపీ ప్రభుత్వం, బీజేపీ, జనసేన అనేక గుళ్లను కూల్చివేశాయని.. వాటిని ఎలాగైన పునర్మించాలనేది ప్రభుత్వ ఆలోచనని మంత్రి చెప్పారు. విజయవాడ ఫ్లై ఓవర్ ప్రారంభం అయిన వెంటనే కొన్ని దేవాలయాలను యథాస్థానంలో నిర్మిస్తామని.. మిగిలినవి సమీపంలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు.