పేదలకు సెంటు భూమి ఫ్రీ.. జగన్ మార్క్ డెసిషన్

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో కీలకమైన పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి కొత్త రూల్స్‌‌ను జారీ చేశారు. పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వడం వల్ల.. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక జీ+3( గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్థుల) అపార్ట్‌మెంట్లను నిర్మించి.. అందరికి ఫ్లాట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే ఈ స్కీమ్‌కు […]

పేదలకు సెంటు భూమి ఫ్రీ.. జగన్ మార్క్ డెసిషన్
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 03, 2019 | 8:06 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల్లో కీలకమైన పేదలందరికీ ఇళ్ల పథకానికి సంబంధించి కొత్త రూల్స్‌‌ను జారీ చేశారు. పేదవాళ్లందరికి పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా పట్టణాల్లో ఒక సెంటు భూమి ఇవ్వడం వల్ల.. ఎకరానికి 55 మంది ఇళ్ల స్థలాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాక జీ+3( గ్రౌండ్ ఫ్లోర్ + 3 అంతస్థుల) అపార్ట్‌మెంట్లను నిర్మించి.. అందరికి ఫ్లాట్లు ఇవ్వాలని చూస్తోంది. ఇకపోతే ఈ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలనుకునేవారు.. తమ రేషన్ కార్డు జిరాక్స్‌ను  ప్రూఫ్‌గా ఇవ్వాల్సి ఉంటుందట. అటు రేషన్ కార్డు లేనివారు కూడా.. మీసేవ ద్వారా ఆదాయ ధృవీకరణ పత్రాన్ని అందజేసి.. దరఖాస్తు చేసుకోవచ్చునని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఉగాది నాటికీ 25 లక్షల మంది పేదవాళ్లకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలన్నది జగన్ సర్కార్ లక్ష్యం. దానికి అనుగుణంగా అధికారులు పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తహశీల్దారులు తమ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న భూముల వివరాల్ని ప్రభుత్వానికి అందించనున్నారు. అంతేకాకుండా అక్రమాలకు తావు లేకుండా లబ్దిదారులకు స్థలాలను కేటాయించేటప్పుడు.. వారి ఆధార్ నంబర్, రేషన్ కార్డు వివరాల్ని దానితో లింక్ చేస్తారు. దీనికి అదనంగా రూ.20 అవుతుంది. అందులో రూ.10 స్టాంపు పేపరు, మిగిలిన రూ.10 పట్టా ల్యామినేషన్‌కు ఖర్చు అవుతుంది. ఇక భూమి వచ్చాక.. ఐదేళ్ల పాటు దాన్ని ఎవరికి అమ్మకూడదు. ఆ తర్వాత నాన్ అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) అనేది అవసరం లేకుండా ఎవరికైనా అమ్ముకోవచ్చునని సమాచారం. కాగా, స్థలాలు పొందిన లబ్ధిదారుల వివరాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో పొందుపరుస్తారు.