ఏపీలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ

|

Oct 17, 2020 | 10:56 PM

ఏపీ వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ...

ఏపీలో 26 మంది డిప్యూటీ కలెక్టర్లు బదిలీ
Follow us on

ఏపీ వ్యాప్తంగా 26 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. తక్షణం ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని పేర్కొంటూ… సీఎస్ నీలం సాహ్ని ఆదేశాలు ఇచ్చారు. డిప్యూటీ కలెక్టర్ల బదిలీలతో పాటు వెయిటింగ్​లో ఉన్నవారికి కూడా పోస్టింగ్​లు ఇస్తూ ఆదేశాలు వెలువడ్డాయి.

సచివాలయంలో ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న వి.సరళను పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్​గా బదిలీ చేశారు. సీసీఎల్​ఏలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న జె. శివశ్రీనివాసును నెల్లూరు జిల్లా ఆసరా, సంక్షేమ శాఖల జేసీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.  దేవాదాయశాఖలో డిప్యూటీ కలెక్టర్​గా ఉన్న కిరణ్ కుమార్​కు పశ్చిమగోదావరి జిల్లా ద్వారకాతిరుమల ఈవోగా నియమించారు. రైతు బజార్ల సీఈవోగా బి. శ్రీనివాసరావుకు పోస్టింగ్ ఇచ్చారు. డి.పెద్దిరాజును శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయ ఈవోగా నియమించారు. డి.వెంకటేశ్వరరావును మాన్సాస్ ట్రస్టు ఈవోగా నియమిస్తూ ఏపీ సర్కార్ ఆదేశాలు ఇచ్చింది.
Also Read : Bigg Boss Telugu 4 : అనుకున్నదే జరిగింది, కుమార్ సాయిని పంపించేశారు !