కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,618 కేసులు

|

Nov 01, 2020 | 6:09 PM

ఏపీలో కరోనా తీవ్రత తగ్గింది.  24 గంటల వ్యవధిలో 88,780 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,618 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు.....

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 2,618 కేసులు
Follow us on

ఏపీలో కరోనా తీవ్రత తగ్గింది.  24 గంటల వ్యవధిలో 88,780 శాంపిల్స్ టెస్ట్ చేయగా 2,618 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌‌లో తెలిపింది. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 8,25,966కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు విడిచారు. కృష్ణా జిల్లాలో 4, చిత్తూరు 3, గుంటూరు 3, అనంతపురం 2, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒకరు చొప్పున వైరస్‌తో మరణించారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌తో మృతి చెందినవారి సంఖ్య 6,706కి చేరింది. 24 గంటల వ్యవధిలో 3,509 మంది వ్యాధి‌ నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 23,668 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 81,17,685 శాంపిల్స్ టెస్ట్ చేసినట్టు ప్రభుత్వం బులెటిన్‌లో  వెల్లడించింది.

Also Read :

వైభవంగా సిరివెన్నెల తనయుడి వివాహం

అదే ప్రేమను కొనసాగించాల్సింది నోయల్ !