ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా… చివరి రోజూ 10 మంది టీడీపీ సభ్యులపై సస్పెన్షన్…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ముగిశాయి. సభలో మొదటి రోజు నుంచి ఆందోళనలు చేపడుతున్న తెలుగు దేశం సభ్యులు వారి ఆందోళనలను డిసెంబర్ 4న కొసాగించారు. ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చివరి రోజు సమావేశాలు ముగిశాయి. సభలో మొదటి రోజు నుంచి ఆందోళనలు చేపడుతున్న తెలుగు దేశం సభ్యులు వారి ఆందోళనలను డిసెంబర్ 4న కొసాగించారు. ఉపాధి హామీ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ స్పీకర్ పోడియం ముందు నిరసన చేపట్టారు. స్పీకర్ పోడియం ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాగా, టీడీపీ నేతలు స్పీకర్ పోడియం ఎక్కడంతో స్పీకర్ తమ్మినేని సీతారం ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ చెప్పిన తీరు మారకపోవడంతో 10 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
అమరావతిపైనా చర్చ…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రాజధాని అమరావతిపై ఆసక్తికర చర్చ జరిగింది. అమరావతి మార్పు అంశం సభలో చర్చకు రాగా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఈ సందర్భంగా అమరావతి మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని మార్చడం లేదని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. అయితే అమరావతితో పాటు మరో రెండు రాజధానులను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. సభలో టీడీపీ సభ్యుల వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక ప్లాన్ ప్రకారం కావాలనే సభలో గంగదరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు.
పలు బిల్లులపై చర్చ…
ఏపీ అసెంబ్లీలో పలు బిల్లులపై చర్చ జరిగింది. ప్రధానంగా పాడి పంట అభివృద్ధి కోసం అమూల్ కంపెనీతో ఏపీ ప్రభుత్వం కుదుర్చుకోనున్న ఎంఓయూలపై చర్చ జరిగింది. అంతే కాకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న పత్రికల తీరును ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీ వేదికగా తప్పుపట్టారు. పింఛన్ల పెంపు, రాజధాని, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యాక్రమాలను సీఎం జగన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఐదు రోజులుగా సాగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 4న నిరవధిక వాయిదా పడింది.
గ్రేటర్ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్డేట్ కోసం దిగువ లింక్ క్లిక్ చెయ్యండి :
GHMC Election Results 2020: Full list of winning candidates : గ్రేటర్ ఎన్నికల్లో విజేతలు వీరే
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..