కాసేపట్లో ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగం

|

Nov 07, 2020 | 12:58 PM

మరో చారిత్రాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 2 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. PSLV C – 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపనున్నారు. EOS -01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ […]

కాసేపట్లో ఇస్రో మరో చారిత్రాత్మక ప్రయోగం
Follow us on

మరో చారిత్రాత్మక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ – ఇస్రో సిద్ధమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరి కోట నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. ఇందులో భాగంగా నిన్న మధ్యాహ్నం ఒంటిగంట 2 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. PSLV C – 49 రాకెట్‌ ద్వారా నింగిలోకి 10 ఉపగ్రహాలను పంపనున్నారు. EOS -01 అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌తో పాటు మరో 9 విదేశీ శాటిలైట్లను ఇస్రో ప్రయోగించనుంది. ప్రయోగం కోసం ఇప్పటికే ఇస్రో చైర్మన్‌, శాస్త్రవేత్తలు శ్రీహరికోటలోని షార్‌కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీహరి కోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టారు. కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలు మినహా ఇంకెవ్వరికీ షార్‌లోనికి అనుమతించడం లేదు. PSLV C సిరీస్‌లో ఇది 51వ ప్రయోగం. శ్రీహరికోట షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి మధ్యాహ్నం 3 గంటల 2 నిమిషాలకు PSLV C – 49 ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. వ్యవసాయం, అటవీ, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేసేందుకు సరికొత్తగా ఈ ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ను రూపొందించినట్లు ఇస్రో వెల్లడించింది. మొదట ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నారు. అయితే- కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. కరోన ప్రభావంతో ఇస్రో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఒక్క ప్రయోగం కూడా చేపట్టలేదు.