ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ దాడులు!

| Edited By:

Sep 26, 2019 | 7:50 PM

తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఔషధాల కొనుగోలులో రూ. 10 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోదాలను ముమ్మరం చేశారు. ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురి నివాసాల్లో గురువారం (సెప్టెంబర్ 26) ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ.10 కోట్లు గోల్‌మాల్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారుల నివాసాలతో పాటు మొత్తం 23 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కార్మిక […]

ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ దాడులు!
Follow us on

తెలంగాణ ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఔషధాల కొనుగోలులో రూ. 10 కోట్ల మేర అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సోదాలను ముమ్మరం చేశారు. ఔషధాల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి పలువురి నివాసాల్లో గురువారం (సెప్టెంబర్ 26) ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కుంభకోణంలో ఇప్పటి వరకు రూ.10 కోట్లు గోల్‌మాల్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ అధికారుల నివాసాలతో పాటు మొత్తం 23 చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

కార్మిక బీమా వైద్య సేవల సంచాలకురాలు (డైరెక్టర్‌) దేవికా రాణి, జాయింట్ డైరెక్టర్ పద్మ, అసిస్టెంట్ డైరెక్టర్ వసంత, ఫార్మాసిస్ట్‌లు ఎం రాధిక, జ్యోత్స్న, ఫాతిమా, లావణ్య, నాగలక్ష్మి, రిటైర్డ్ ఫార్మాసిస్ట్ సబితా, సీనియర్ అసిస్టెంట్లు సురేంద్రనాథ్, హర్షవర్ధన్, పావని, రికార్డు అసిస్టెంట్ రాజశేఖర్, సూపరింటెండెంట్లు సురేశ్ అగర్వాల్, వీరన్న, ఆఫీస్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఎండీ శ్రీధర్, నాగరాజు, సుధాకర్‌ రెడ్డి, నరేందర్‌ రెడ్డి నివాసాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఓమ్నీ మెడికల్‌ సిబ్బందితో పాటు మొత్తం 23 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారులు వెల్లడించాల్సి ఉంది.