ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 477 కేసులు..

కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఏపీలో కరోనా కలకలం.. కొత్తగా 477 కేసులు..

Updated on: Jun 21, 2020 | 1:56 PM

Coronavirus In AP: కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. భారత లో రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. ఏపీలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్నది. రాష్ట్రంలో కొత్తగా 477 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,929కి చేరింది. వైరస్‌బారినపడినవారిలో ఇప్పటివరకు 106 మంది మరణించగా, 4,307 మంది కోలుకున్నారు. మరో 4,516 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. వీరిలో కృష్ణా జిల్లాకు చెందినవారు ముగ్గురు, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో ఒక్కరు చొప్పున ఉన్నారు.

కాగా.. ఈ రోజు నమోదైన కేసుల్లో రాష్ట్రానికి సంబంధించి 439 కేసులు ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు నలుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో 11, చిత్తూరు జిల్లాలో 47, గుంటూరులో 26, తూర్పుగోదావరి 70, కడపలో 58, కృష్ణాలో 66, కర్నూలులో 47, నెల్లూరులో 12, ప్రకాశంలో 5, విశాఖపట్నంలో 39, విజయనగరంలో 6, పశ్చిమగోదావరిలో 52 కేసుల చొప్పున ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో ప్రకాశం జిల్లా ఒంగోలు, అనంతపురం జిల్లాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతున్నది.

Also Read: భారత్ లో.. గత 8 రోజుల్లో.. లక్ష మందికి కరోనా..

 

Loading...
Unable to load recommendations.
Follow Us