ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో తీపి కబురు!

| Edited By:

Aug 07, 2020 | 3:57 PM

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ఏఓ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో రుణాల నియమ నిబంధనలపై డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రైతులకు మరో తీపి కబురు!
Follow us on

ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. ఏఓ కార్యాలయంలో వ్యవసాయాధికారులతో రుణాల నియమ నిబంధనలపై డీసీఎంఎస్‌ చైర్మన్‌ వీరి చలపతిరావు చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ, 50 శాతం రుణం, పది శాతం రైతు వాటాతో రుణాలు మంజూరు చేస్తోందని తెలిపారు. ఈ రుణాలు పొందేందుకు ఒక్కో రైతు భరోసా కేంద్రం పరిధిలో 5 నుంచి 6 మంది రైతులు గ్రూపుగా ఏర్పడాలన్నారు.

గ్రూపుగా ఏర్పడ్డ రైతులకు.. రైతు భరోసా కేంద్రం పరిధిలో పొలం ఉండాలి. ఈ నెల 15 లోగా ఆర్బీకేలో రిజిస్టర్‌ చేయించుకోవాలని చెప్పారు. ఒక్కో గ్రూపుకు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు విలువైన యంత్రాలను అందజేస్తోందన్నారు. ఈ రుణంతో ట్రాక్టర్లు, రోటో వేటర్లు, సీడ్‌ ట్రిల్లర్‌ తదితర యంత్ర పరికరాలు కొనుగోలు చేసి ఆర్బీకే ద్వారా రైతులకు అద్దెకివ్వచ్చన్నారు. తద్వారా వచ్చిన రాబడితో రుణం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా.. రైతు భరోసా కేంద్రంలో రిజిస్టర్ అయిన రైతులకు వచ్చే రుణం మొత్తంలో ప్రభుత్వం 40 శాతం రాయితీగా వస్తే, 50 శాతం ఎన్‌డీసీసీబీ రుణమిస్తుందని చెప్పారు. రైతులు వ్యవసాయ యంత్ర పరికరాలను ఎంపిక చేసుకునేందుకు సెప్టెంబరు 2న నెల్లూరు, కావలి, గూడూరు తదితర ప్రాంతాల్లో వివిధ కంపెనీల ఉత్పత్తులతో ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సెప్టెంబరు 15 తేదీ కల్లా ఎన్‌డీసీసీబీ రుణాలు మంజూరు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్టోబరు 2 కల్లా ఆర్బీకేల్లో వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న రైతులు గ్రూపుగా రిజిస్టర్‌ చేసుకోవాలని కోరారు.