కోనసీమలో కరోనా టెర్ర‌ర్…ఒక్క రోజే 28 కేసులు

|

Jun 02, 2020 | 3:33 PM

రెండున్నర నెలలుగా కోన‌సీమ ప్ర‌శాంతంగా ఉంది. నిబంధనల సడలింపుల‌తో కోనసీమ మీద పిడుగు పడినట్లు అయింద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

కోనసీమలో కరోనా టెర్ర‌ర్...ఒక్క రోజే 28 కేసులు
Follow us on

కోనసీమలో కరోనా టెర్ర‌ర్ క్రియేట్ చేస్తోంది. మొన్న‌టివ‌ర‌కు స్ట్రిక్ట్ లాక్‌డౌన్ అమ‌ల‌వ‌డంతో వ్యాప్తి అమలులోకి వ‌చ్చింది. అయితే ప్రభుత్వం భారీ స‌డ‌లింపులు ఇవ్వ‌డం, వ‌ల‌స కూలీలు సొంత ఊర్ల‌కు రావ‌డంతో కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగింది. ఇవాళ ఒక్కరోజే 28 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ముంబై నుంచి వచ్చిన వలస కూలీలు ద్వారా క‌రోనా వ్యాప్తి చెందిన‌ట్టు తెలుస్తోంది. రాజోలు 12, రావులపాలెం 5, ముమ్మిడివరంలో 3, అమలాపురం 7, పిఠాపురం 1 చొప్పున పాజిటివ్ కేసుల‌ను గుర్తించారు.

రెండున్నర నెలలుగా కోన‌సీమ ప్ర‌శాంతంగా ఉంది. నిబంధనల సడలింపుల‌తో కోనసీమ మీద పిడుగు పడినట్లు అయింద‌ని అక్క‌డి ప్ర‌జ‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కేసుల సంఖ్య పెర‌గ‌డంతో వెంట‌నే అప్ర‌మత్తం అయిన అధికారులు యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్యలు చేప‌డుతున్నారు. కాగా జిల్లాలో 144 సెక్ష‌న్ కొన‌సాగుతోంది.