25 మంది తాలిబన్లు హతం.. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు..

| Edited By:

Jul 22, 2020 | 5:40 PM

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు, ఆర్మీకి మధ్య వార్‌ జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం కూడా తాలిబన్ ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తోంది. తాజాగా కాందహార్‌..

25 మంది తాలిబన్లు హతం.. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు..
Follow us on

ఆఫ్ఘనిస్థాన్‌లో మళ్లీ తాలిబన్లకు, ఆర్మీకి మధ్య వార్‌ జరుగుతోంది. గడిచిన కొద్ది రోజులుగా ఆఫ్ఘన్‌ సైన్యం లక్ష్యంగా తాలిబన్లు దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘన్ సైన్యం కూడా తాలిబన్ ఉగ్రవాదుల్ని ఏరిపారేస్తోంది. తాజాగా కాందహార్‌ ప్రావిన్స్‌లోని తక్ట్‌ ఏ పొల్ పట్టణంలో సోమవారం రాత్రి తాలిబన్ ఉగ్రవాదులు లక్ష్యంగా నాటో రెస్క్యూ టీం ఎయిర్ స్ట్రైక్ చేపట్టింది. ఈ ఘటనలో 25 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో 12 మంది పాకిస్థానీయులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కాందహార్‌ పోలీసు అధికారులు తెలిపారు. మరణించిన పాకిస్థానీయులు తాలిబన్లకు సహాయంగా ఉంటూ పోరాడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇటీవల ఆఫ్ఘన్‌ ఆర్మీ పోస్టులను టార్గెట్‌ చేస్తూ తాలిబన్లు అనేక దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో సైన్యం జరిపిన దాడుల్లో దాదాపు పదుల సంఖ్యలో తాలిబన్ ఉగ్రవాదులు హతమయ్యారు.